
Dharmendra: ఏంటి ధర్మేంద్ర హేమమాలిని ప్రెగ్నెన్సీ కోసం ఇప్పటివరకు ఎవరూ చేయని ఆ పని చేశారా? ఎందుకు అంత రహస్యంగా ప్రెగ్నెన్సీ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు.. అనేది ఇప్పుడు చూద్దాం. హేమ మాలిని ధర్మేంద్ర ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక ధర్మేంద్రకు మొదట ప్రకాష్ కౌర్ తో పెళ్లి జరిగినప్పటికి ఆమెకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేక హేమమాలిని ని వదిలి ఉండడం నచ్చక చివరికి ముస్లిం మతంలోకి మారి హేమమాలినిని రెండో పెళ్లి చేసుకున్నారు.
Why did Dharmendra do such a thing for Hema Malini pregnancy
అలా మొదటి భార్య ప్రకాష్ కౌర్ కి నలుగురు పిల్లలు పుట్టగా రెండో భార్య హేమమాలినికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే హేమమాలినికి ఈషా డియోల్, అహానా డియోల్ అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇక హేమమాలిని ధర్మేంద్రలకు మొదటి సంతానంగా పుట్టింది ఈషా.. కానీ ఈశా పుట్టినప్పుడు ధర్మేంద్ర ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట.ముఖ్యంగా హేమమాలిని ప్రెగ్నెన్సీ విషయం చాలావరకు సన్నిహితులకు కూడా తెలియదట.. (Dharmendra)
Also Read: Dharmendra: హేమమాలినితో పెళ్లి కోసం హిందూ మతాన్ని పక్కన పెట్టిన ధర్మేంద్ర..ఏం చేశారంటే.?
అయితే 1981లో ఈషా పుట్టింది. ఇక అలా ఈషా పుట్టిన సమయంలో హేమమాలిని ప్రెగ్నెన్సీ విషయం తెలిసి అందరూ హాస్పిటల్ కి పరిగెత్తుతారు అని ధర్మేంద్ర ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట. హేమమాలిని ఇషా డియోల్ కి జన్మనిచ్చే సమయంలో ఏకంగా ఆ హాస్పత్రి మొత్తాన్ని బుక్ చేసుకున్నారట.

హాస్పిటల్ లో ఏకంగా 100 రూమ్స్ ఉండగా ఆ వంద రూమ్స్ అన్నింటిని ధర్మేంద్ర బుక్ చేశారట. అలా చాలా సీక్రెట్ గా తమ మొదటి బిడ్డని ఆహ్వానించారట. అయితే ఈ విషయం చాలామందికి తెలియదట.అయితే గతంలో ఈ విషయాన్ని హేమమాలిని స్నేహితురాలు నీతూ కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తాజాగా ఈ విషయం మరోసారి నెట్టింట వైరల్ అవుతుంది.(Dharmendra)





