
Sholay: 1975 లో వచ్చిన బ్లాక్ బస్టర్ షోలే మూవీ అప్పట్లో ఎంతోమంది సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమా ద్వారా అమితాబ్ బచ్చన్ స్టార్ అవ్వగా ధర్మేంద్రకు పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, హేమమాలిని, జయ భాధురీలు కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాలో వీరు, జై పాత్రలో ధర్మేంద్ర నటించగా..జై పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించారు.
Remake of the blockbuster Sholay
ఇక అప్పట్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాని ఓ డైరెక్టర్ తెలుగులో ప్రభాస్ తో పాటు మరో హీరోని పెట్టి రీమేక్ చేయాలి అనుకున్నారట. ఇక ఆ డైరెక్టర్ ఎవరంటే పూరి జగన్నాథ్..2011లో పూరి జగన్నాథ్ ప్రభాస్,గోపీచంద్ లతో షోలే మూవీ రీమేక్ చేస్తున్నట్టు పలు వార్తలు సినీ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. అంతేకాదు ధర్మేంద్ర పోషించిన వీరు పాత్రలో ప్రభాస్.. (Sholay)
Also Read: Dharmendra: హేమమాలినితో పెళ్లి కోసం హిందూ మతాన్ని పక్కన పెట్టిన ధర్మేంద్ర..ఏం చేశారంటే.?
అమితాబ్ బచ్చన్ పోషించిన జై పాత్రలో గోపీచంద్ నటించబోతున్నట్టు పలు వార్తాపత్రికల్లో కూడా ప్రచురితమైంది.కానీ ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు.అలా చివరికి సినిమా రూమర్ గానే మిగిలిపోయింది.

ఇక ఇందులో స్నేహితులుగా నటించిన అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర లాగే రియల్ లైఫ్ లో స్నేహితులైనటువంటి గోపీచంద్ ప్రభాస్ నటించిన సినిమా అద్భుతంగా ఉంటుంది అని ఆ మధ్య కాలంలో వార్తలు కూడా వినిపించాయి కానీ ఎందుకో ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. అలాగే ఈ సినిమా గురించి ఇప్పటివరకు పూరి జగన్నాథ్ కూడా ఎక్కడ అధికారికంగా మాట్లాడలేదు.(Sholay)





