
Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. వైన్స్ దుకాణాల విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత మద్యం దుకాణాలు తెరవాలని ఆయన ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. సాయంత్రం 6 గంటల తర్వాత పర్మిట్ రూమ్ లోకి అనుమతించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. Rajagopal Reddy
Wines Will Open Only After 1 Pm Rajagopal Reddy
ఇక ఈ ఆదేశాలు పాటించకుండా యధావిధిగా మద్యం దుకాణాలు. దీంతో బలవంతంగా ఆ మద్యం దుకాణాలను మూసి వేయించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు. మద్యం దుకాణాల యజమానులు తమకు నష్టం కలుగుతుందని ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో ఉదయం 10 గంటలకు మద్యం దుకాణాలు ఎక్సైజ్ శాఖ అధికారులు దగ్గరుండి తెరిపించడం జరిగింది. Rajagopal Reddy
Also Read: Telangana: టీ-హబ్ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ?
అయితే ఎలాగైనా తాను అనుకున్నా నిబంధనలు అమలు చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యం దుకాణాల వద్ద స్థానిక పోలీసులతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహించారు. కేవలం ఒక్కరోజులోనే పదికి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. సంస్థాన్ నారాయణపూర్ మండలంలో మధ్యాహ్నం ఒంటిగంటకే మద్యం దుకాణాలు ఈ దెబ్బకు తెరుచుకోవడం జరిగింది. Rajagopal Reddy
Also Read: Bhatti Vikramarka Mallu: భట్టి విక్రమార్కకు కమ్మ మహాజన సంఘం హెచ్చరిక?





